పాకిస్తాన్‌ పై తాజాగా ఇరాన్‌ మెరుపు దాడులు

Published: Friday February 05, 2021

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ పై తాజాగా ఇరాన్‌ మెరుపు దాడులు నిర్వహించింది. కొన్నిరోజుల క్రితం భారత దేశం నిర్వహించిన మాదిరిగానే మెరుపుదాడులు( సర్జికల్‌ స్ర్టైక్‌ ) చేసింది. ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌ దళం( ఐఆర్‌జేసీ) దీనిని నిర్వహించింది. à°—à°¤ కొంత కాలంగా బెలూచిస్తాన్‌లో చెరలో ఉన్న తమ సైనికులిద్దరిని విడిపించుకు వెళ్లేందుకు ఇరాన్‌ à°ˆ మెరుపుదాడి నిర్వహించినట్టు ఐఆర్‌జేసీ వెల్లడించింది. బెలూచిస్తాన్‌లోని జైష్‌ ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద సంస్ధ 2018లో 12 మంది ఇరాన్‌ సైనికులను అపహరించింది. à°ˆ ముఠా ఇరాన్‌కు వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. 

 

ఇరాన్‌ సైనికులను విడిపించడానికి à°’à°• కమిటీ ఏర్పాటు అయ్యింది. తాజాగా నిర్వహించిన మెరుపుదాడిలో ఇద్దరు బందీలను ఇరాన్‌ విడిపించుకు వెళ్లింది. బెలూచిస్తాన్‌కు చెందిన జైష్‌ ఉల్‌అదల్‌ ఉగ్రవాద సంస్థ ఇరాన్‌ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి పాకిస్తాన్‌కు తరలించుకుపోయిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి.