సత్సంగ్ ఆశ్రమాన్ని సందర్శించిన రాష్ట్రపతి

Published: Sunday February 07, 2021

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లె సత్సంగ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ అధిపతి ముంతాజ్ అలీతో కలిసి ఆయన సత్సంగ్‌లో నూతనంగా నిర్మించిన భారతి యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆశ్రమంలో మొక్కలు కూడా నాటారు. ముంతాజ్‌ అలీకి చెందిన సత్సంగ్‌ ఆశ్రమంలో పలు నిర్మాణాలకు, స్వస్థ్య ఆస్పత్రికి రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భారత్‌ యోగా విద్యా కేంద్రకు సంబంధించిన యోగా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సదుం మండలంలో ముంతాజ్‌ అలీ నిర్వహిస్తున్న పాఠశాలకు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళతారు.