ఎన్నికల అక్రమాలపై ట్రైబ్యునల్‌కే వెళ్లాలి

Published: Thursday March 04, 2021

పురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. అంతేగాక.. నామినేషన్ల అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణల విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ à°—à°¤ నెల 16à°¨ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కూడా సస్పెండ్‌ చేసిం ది. à°ˆ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీవీఎస్‌ సోమయాజులు బుధవారం తీర్పు ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేయడానికి అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థులు ఎన్నికల ట్రైబ్యునల్‌ను మాత్రమే ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు, వంచన చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలన్నారు. à°—à°¤ ఏడాది మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో 14 డివిజన్లు, వార్డుల్లో రీనామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పిస్తూ à°ˆ నెల 1à°¨ ఎస్‌ఈసీ ఉత్తర్వులివ్వడం, వీటిని సవాల్‌ చేస్తూ చేసూ ్తతిరుపతి నగరపాలక సంస్థ డివిజన్లు, à°•à°¡à°ª జిల్లా రాయచోటి పురపాలక సంఘం వార్డులో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై మంగళవారం వాదనలు ముగిశాయి.

 

న్యాయమూర్తి బుధవారం తీర్పు ప్రకటించారు. ‘నామినేషన్ల దాఖలు దశ నుండి ఫలితాలు ప్రకటించే వరకు వచ్చే ఫిర్యాదులను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు, వంచన చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలి. à°ˆ నేపథ్యంలో రీనామినేషన్‌ వేసేందుకు ఎస్‌ఈసీ ఉత్తర్వులివ్వడానికి వీల్లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమే అయినా.. చట్టం పిటిషనర్లకు అనుకూలంగా ఉంది. ఎస్‌ఈసీ చర్యలు సమాజహితం కోసమే అయినప్పటికీ చట్ట నిబంధనల నేపథ్యంలో దాని ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నాం’ అని  పేర్కొన్నారు.