జగన్‌కు భూములు, డబ్బు పిచ్చి..

Published: Saturday March 06, 2021

‘ఎన్నికలలో పోటీచేసే మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. à°ˆ రాష్ట్రమేమైనా వీళ్ల అబ్బ సొత్తా?  వీళ్లను ఇలాగా విడిచిపెడితే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. చివరకు ఆడబిడ్డలకు కూడా రక్షణ కరువవుతుంది. అరాచక పాలకులకు మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను కోరారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన పెందుర్తిలో రోడ్‌షో ప్రారంభించారు. పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం జంక్షన్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘అరాచక పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలి. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలి.  అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి... బొబ్బిలి పులిలా గాండ్రించాలి.

 

ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి’’ అని కోరారు. ఆంధ్రుల పోరాటాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏ-1, ఏ-2లు దొంగనాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘దక్షిణకొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీ తనకు తెలియదని సీఎం బుకాయించారు. పార్లమెంటులో మంత్రి సమాధానంతో అడ్డంగా దొరికిపోయారు. పోస్కోతో స్టీల్‌ప్లాంట్‌ నాన్‌బైండింగ్‌ ఒప్పందం బట్టబయలు కావడంతో వీరి కుట్రలు ప్రజలకు తెలిశాయి. ఉక్కు భూములను అమ్మేయడానికి ఎన్‌బీసీకి అఽధికారం ఇచ్చారు. నష్టాలను పూడ్చడానికి భూములు అమ్మేస్తామని చెప్పడంతో జగన్‌ అసలు స్వరూపం బయటపడింది’’ అని వ్యాఖ్యానించారు. భూములన్నా.. డబ్బులన్నా à°ˆ సీఎంకు పిచ్చి అని విమర్శించారు. ‘‘రాష్ట్ట్రంలో ఆస్తులను జగన్‌ అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో అందరినీ అమ్మేస్తారు’’ అని మండిపడ్డారు.