ఏపీలో బీజేపీ రథయాత్ర

Published: Saturday March 13, 2021

 à°à°ªà±€à°²à±‹ రథయాత్రకు బీజేపీ సిద్ధమవుతోంది. తిరుపతిలోని కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరిగిన ప్రాంతాల్లో రథయాత్ర కొనసాగతుంది. à°ˆ యాత్ర తిరుపతి, నెల్లూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడ, అంతర్వేది, పిఠాపురం మీదుగా రామతీర్థం చేరుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను పోలీసులకు బీజేపీ నేతలు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యా గతంలో బీజేపీ రథయాత్ర వాయిదాపడింది. అప్పుడు వాయిదా పడ్డ యాత్ర.. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక కంటే ముందు ప్రారంభించాలని బీజేపీ యోచిస్తున్నారు. రథయాత్ర ప్రభావం తిరుపతి ఉప ఎన్నికపై ఉంటుందని బీజేపీ చెబుతున్నారు.