ఇప్పుడే కరోనాను అరికట్టేద్దాం

Published: Wednesday March 17, 2021

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ మీట్ నిర్వహించారు. à°ˆ సమావేశానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాగేల్ గైర్హాజరయ్యారు. à°ˆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.... అందరూ అత్యంత క్రియాశీలకంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అవసరమున్న చోట్ల ‘మైక్రో కంటెయిన్మెంట్’ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయవద్దని, అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుందామని, అంతేగానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

 

కొన్ని ప్రాంతాల్లో కరోనా టెస్టులు ఎందుకు తక్కువగా చేస్తున్నారో అర్థం కావడం లేదని, సుపరిపాలన అందించడానికి ఇదే సరైన సమయం అని తెలిపారు. ఆత్మ విశ్వాసంతోనే ముందుకెళ్దామని, అలాగని అతి ఆత్మవిశ్వాసం కూడదని హెచ్చరించారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, త్వరిత గతిన అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎంలకు సూచించారు. ఇప్పటి వరకూ సురక్షితంగా ఉన్న జిల్లాల్లోనే తిరిగి కరోనా పెరుగుదల కనిపిస్తోందని, 70 జిల్లాల్లో కరోనా తీవ్రత గతంలో కంటే అధికంగా కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. దీనిని కరికట్టకపోతే మరోసారి కరోనా విలయ తాండవం చేసే అవకాశం ఉందని, అలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

కరోనాతో ప్రభావితమైన చాలా దేశాలు రెండో వేవ్‌ను చవిచూస్తున్నాయని, మన దేశం కూడా à°† జాబితాలోకే వస్తుందని మోదీ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయని, à°ˆ విషయంపై ముఖ్యమంత్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కరోనా నుంచి చాలా మంది కోలుకుంటున్నారని, మరణాల రేటు తక్కువగా ఉన్న జాబితాలోకి ఇండియా చేరిందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి వక్కానించారు.