కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాద మరణాల అధికం

Published: Thursday March 18, 2021

కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యే అధికంగా ఉందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని, à°ˆ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌à°—à°¾ ఉందని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... ‘‘రోడ్డు ప్రమాదాల విషయంలో కేంద్రం తీవ్ర ఆందోళనగా ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీనిపై చాలా సీరియస్‌గానే ఉన్నాం. కరోనా కారణంగా 1.46 లక్షల మంది మరణించారు. కానీ రోడ్డు ప్రమాదాలతో 1.5 లక్షల మంది మృతి చెందారు.’’ అని గడ్కరీ వివరించారు. అయితే à°ˆ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారందరూ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారేనని గడ్కరీ వెల్లడించారు.