ఈ ఏడాది జూలైలో ఏపీ టెట్‌

Published: Thursday March 18, 2021

 à°‰à°ªà°¾à°§à±à°¯à°¾à°¯à±à°² అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తారు. గతంలో ఏటా రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 2017లో ఒకసారి, 2018లో ఒకసారి మాత్రమే ఏపీ టెట్‌ నిర్వహించారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) తాజా మార్గదర్శకాల మేరకు ఇక ఏటా ఒక్కసారి మాత్రమే ఏపీ టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టెట్‌ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. 1 నుంచి 5 తరగతలకు బోధించే టీచర్ల కోసం పేపర్‌-1, 6-8 తరగతులకు బోధించే టీచర్ల కోసం పేపర్‌-2 నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో మళ్లీ రెండు కేటగిరిలు ఉంటాయి. జనరల్‌ స్కూళ్లలో పనిచేసే టీచర్ల కోసం పేపర్‌-1à°Ž, పేపర్‌-2à°Ž నిర్వహిస్తారు. స్పెషల్‌ స్కూళ్లలో పనిచేసే టీచర్ల కోసం పేపర్‌-1బి, పేపర్‌-2బి నిర్వహిస్తారు.  టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజి ఉంటుంది.

 

జనరల్‌ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం క్వాలిఫైయింగ్‌ మార్కులుగా నిర్ణయించారు. పేపర్‌-1, 2 లను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 150 మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారితంగా టెట్‌ నిర్వహిస్తారు. à°ˆ మేరకు మార్గదర్శకాలతో పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. తాజా సమాచారం ప్రకారం à°ˆ ఏడాది జూలైలో ఏపీ టెట్‌ నిర్వహించే అవకాశముంది.