రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ విజయవంతం

Published: Tuesday March 30, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà°¤à°¿ రామ్‌నాథ్ కోవింద్‌కు జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం à°“ ట్వీట్ ద్వారా తెలిపారు. ఢిల్లీలోని à°…à°–à°¿à°² భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో ఆయనకు à°ˆ చికిత్స జరిగినట్లు తెలిపారు. à°ˆ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు. రాష్ట్రపతి కోవింద్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ డైరెక్టర్‌ను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. 

 

ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో రాష్ట్రపతి కోవింద్‌ à°—à°¤ శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ (ఆర్ అండ్ ఆర్) ఆసుపత్రిలో హెల్త్ చెక్-అప్ చేయించుకున్నారు. ప్లాన్‌డ్ బైపాస్ ప్రొసీజర్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో కోవింద్‌ను మార్చి 27à°¨ మధ్యాహ్నం ఎయిమ్స్‌కు తరలించారు. 

 

రాష్ట్రపతి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వం కన్నా ఎక్కువ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టే బిల్లుకు ఆయన ఆమోదం తెలిపారు.