రాష్ట్రంలో ముంచుకొస్తున్న కొరత.. రెండో డోస్‌ డౌటే?

Published: Thursday April 08, 2021

-రాష్ట్రంలో ప్రస్తుతం 4లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అవీ పూర్తవుతాయి. అప్పుడు కోల్డ్‌చైన్‌ పాయింట్ల నుంచి రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు సున్నాకు చేరనున్నాయి. à°ˆ నేపథ్యంలో అత్యవసరంగా కోటి డోస్‌à°² వ్యాక్సిన్‌ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఏపీతో పోలిస్తే మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున వారిని కాదని కోటి డోస్‌లు ఇవ్వలేమని, అత్యవసరంగా 3లక్షల డోస్‌లు మాత్రమే సరఫరా చేస్తామని తేల్చిచెప్పింది. ఏప్రిల్‌ 15తర్వాత మరో 10లక్షల డోస్‌లు పంపుతామని స్పష్టం చేసింది. దీంతో ఇటు ప్రభుత్వం, ఆటు ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు లక్ష మందికి టీకా వేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4లక్షల డోస్‌లు, కేంద్రం ఇవ్వనున్న 3లక్షల డోస్‌లతో కొన్ని రోజులు కాలం వెళ్లబుచ్చినా, à°† తర్వాత ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ముంచుకొస్తున్న వ్యాక్సిన్‌ కొరత అధికార, వైద్యవర్గాలకు à°•à°‚à°Ÿà°¿ మీద కునుకు లేకుండా చేస్తోంది. 

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోస్‌ వేయడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. సరిపడా నిల్వలు అందుబాటు లేకపోవడం, కేంద్రం కూడా చేతులెత్తేయడంతో ఆరోగ్యశాఖకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు చేస్తూనే ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిదానంగా చేయాలని, సరఫరా చేసిన డోస్‌à°² ఆధారంగానే ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలని సూచిస్తూ వచ్చింది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు à°ˆ సూచనలు గాలికి వదిలేశారు. కేంద్రం మార్గదర్శకాలను బుట్టదాఖలు చేసి సొంత నియమాలతో వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. టీకా వేయించుకోకపోతే కష్టమని ఊదరగొట్టి, ప్రజలను భయాందోళలనకు గురిచేసి మరీ వ్యాక్సిన్‌ వేయించారు. ఇప్పుడు నిల్వలు నిండుకోవడంతో తప్పంతా కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి డోస్‌ వేయించుకున్న వారు రెండో డోస్‌ వేయించుకోకపోతే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వం జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. నిల్వలు తక్కువగా ఉన్నందున 135- 150 వరకూ వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని, ప్రతి కేంద్రంలో వంద మందికి మించి టీకా వేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయాలన్న ఉద్దేశంతో తొలిరోజు నుంచే 350 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ కేంద్రాల సంఖ్య పెంచుకుంటూ చివరికి గ్రామ సచివాలయాల్లోనూ టీకా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం వంద డోస్‌à°² వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే తొలి విడతలో 45మందికి టీకా వేయాలి. మరో 45 డోస్‌లు అదే లబ్ధిదారులకు రెండో డోస్‌ కోసం భద్రపరచాలి. మిగిలిన 10 డోస్‌లు వృథాగా పరిగణిస్తారు. ఆరోగ్యశాఖ à°ˆ నిబంధనను పట్టించుకోలేదు. రాష్ట్రానికి వచ్చిన మొత్తం డోస్‌లను తొలి విడతలోనే ఎక్కువమందికి అందించారు. రెండో డోస్‌ గురించి ఆలోచించలేదు. కేంద్రం హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ముందస్తు ప్రణాళికలు లేకుండా తొలినుంచి చేసిన తప్పిదాలే నేడు రెండో డోస్‌ అందుబాటులో లేకపోవడానికి కారణంగా మారాయి