కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Published: Tuesday April 20, 2021

 à°à°ªà±€à°²à±‹ రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గతంలో వయస్సు పైబడినవారినే టార్గెట్ చేసిన కరోనా.. ఈసారి వయసుకు సంబంధం లేకుండా à°† వైరస్‌కు ఇష్టం వచ్చిన రీతిలో కోరలు చాపుతూ....యువతను కూడా బలి తీసుకుంటుంది. ఇప్పటికే పలు కుటుంబాల్లో పలువురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కరోనా... తాజాగా విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకుంది. నాలుగురోజుల క్రితం కరోనా వైరస్‌తో పాతబస్తీకి చెందిన లాయర్‌ దినేష్(37) మృతి చెందాడు. ఇవాళ తెల్లవారుజామున దినేష్ తండ్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం కరోనాతో దినేష్ తల్లి, బాబాయ్ కన్నుమూశారు. మొత్తానికి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. à°ˆ ఘటనతో à°† నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.