కరోనా పరీక్షలు పెంచని ప్రభుత్వం

Published: Sunday April 25, 2021

కరోనా విజృంభణతో టెస్ట్‌à°² కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకూ పరీక్షలెక్కడ చేస్తున్నారన్న వెతుకులాటతో అంతా ఇబ్బందులు పడుతున్నా ఆరోగ్యశాఖ స్పందించడం లేదు. సామర్థ్యం భారీగా ఉన్నా టెస్ట్‌à°² సంఖ్యను పెంచకుండా చోద్యం చూస్తోంది. రాష్ట్రంలో 13జిల్లాల్లో కలిపి 14 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉన్నాయి. తిరుపతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌ ఉంది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ప్రైవేటు ల్యాబ్‌లు మరో 45వరకూ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు 170 ట్రూనాట్‌ మిషన్లు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ ఉపయోగించి రోజూ దాదాపు లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపినా టెస్ట్‌à°² సంఖ్య 45వేలు దాటడం లేదు.

 

మొన్నటి వరకూ 30- 31వేల మందికి మాత్రమే పరీక్షలు చేసేవారు. ప్రజలు గగ్గోలు పెట్టడం, మీడియా ఒత్తిడి చేయడంతో ఇప్పుడు వాటి సంఖ్య 45వేలకు చేరింది. రాష్ట్రంలో 24à°—à°‚à°Ÿà°² వ్యవధిలో లక్షమంది నుంచి శాంపిల్స్‌ తీసుకుని ఒక్కరోజులో రిపోర్టు ఇచ్చే వ్యవస్థ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో à°…à°‚à°¤ భారీగా టెస్టులు చేస్తే కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన ప్రభుత్వానికి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టెస్టులు తగ్గించడమే మేలని ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం వాటి సంఖ్యను పెంచకుండా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలోని 15 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో ప్రస్తుతానికి రెండు షిఫ్ట్‌ల్లో మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీటి సామర్థ్యం ప్రకారం 3షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి 4గంటలకు à°’à°• బ్యాచ్‌కు సంబంధించిన శ్యాంపిల్స్‌ టెస్ట్‌ చేయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో 15 ల్యాబ్‌ల్లో కలిపి దాదాపు 45వేల వరకూ నమూనాలు పరీక్షించవచ్చు. రాత్రి మరో 20వేల శాంపిల్స్‌ టెస్ట్‌ చేసే సామర్థ్యం ఉంది. గతంలో 96(à°’à°• బ్యాచ్‌) శాంపిల్స్‌ టెస్ట్‌ చేయాలంటే 6నుంచి 8à°—à°‚à°Ÿà°² సమయం పట్టేది.

 

ఇప్పుడు కేవలం 4గంటల్లో à°’à°• బ్యాచ్‌ రిపోర్టులు వచ్చే వ్యవస్థ ఉంది. అంటే 15 ల్యాబ్‌లు 24గంటలు పనిచేస్తే రోజుకు 6 షిఫ్ట్‌ల్లో కూడా టెస్టులు చేసే అవకాశం ఉంది. అయితే సిబ్బంది కొరతతో ప్రభుత్వం కేవలం రెండు షిఫ్ట్‌లతో మాత్రమే శాంపిల్స్‌ టెస్ట్‌ చేయిస్తోంది. ఇవికాకుండా 45 ప్రైవేటు ల్యాబ్‌ల్లో రోజుకు 20వేల వరకూ శాంపిల్స్‌ పరీక్షించవచ్చు. ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. మొదటి విడతలో ప్రైవేటు ల్యాబ్‌ల్లో ప్రభుత్వానికి సంబంధించిన శాంపిల్స్‌ కూడా పంపించి టెస్టులు చేసేవారు. ఇప్పుడు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు.