నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు

Published: Sunday May 16, 2021

కరోనా మహమ్మారితోనే జనం అల్లాడిపోతుంటే.. ఇప్పుడు మరో వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. అదే బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకోర్‌మైకోసిస్‌). వైరస్‌ బారిన పడి కోలుకున్న వారిని à°ˆ బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. à°ˆ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారికి చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదంగా మారుతోంది. కొవిడ్‌ రోగులకు ప్రాణాంతకంగా మారిన à°ˆ బ్లాక్‌ ఫంగ్‌సను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌లు కృషి చేస్తున్నాయి. à°ˆ ఫంగస్‌ సోకిన వారిలో మరణాలు 50 శాతంగా ఉన్నాయి. అంటే ప్రతి ఇద్దరు బాధితుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫంగస్‌ సోకిన వారికి తలనొప్పి, ముక్కుదిబ్బడ, జ్వరం, కంటిచూపు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. రోజురోజుకూ à°ˆ ఫంగస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ పలు సూచనలు చేశాయి. ‘‘బ్లాక్‌ ఫంగ్‌సను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

 

గాలి పీల్చుకున్నప్పుడు మ్యుకోర్‌ అనే ఫంగస్‌ సైనస్‌ లేదా ఊపిరితిత్తుల్లో చేరుతుంది’’ అని తెలిపాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కూడా à°ˆ ఫంగ్‌సపై ప్రజలకు అవగాహన కల్పించేలా à°“ ట్వీట్‌ను షేర్‌ చేశారు. ఫంగస్‌ లక్షణాలు, దీని వల్ల కలిగే దుష్పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి వివరాలను వెల్లడించారు. త్వరగా à°ˆ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడం, అవగాహన పెంచుకోవడం ద్వారానే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. కాగా, కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ పెరిగిపోవడానికి స్టెరాయిడ్ల దుర్వినియోగం కూడా కారణమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. కొవిడ్‌-19 కారణంగా ఇప్పుడీ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కొవిడ్‌ బాధితుల్లో à°ˆ కేసులు పెరగడానికి ప్రధాన కారణం స్టెరాయిడ్లను ఇష్టానుసారం వినియోగించడమేనని చెప్పారు. ‘‘à°ˆ ఫంగస్‌ ముఖంపై ప్రభావం చూపుతుంది. కంటిచూపు కోల్పోయేందుకు కారణమవుతోంది. మెదడుకూ చేరుతోంది’’ అని గులేరియా తెలిపారు. ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూసే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.