భారత్లో 2 కోట్ల 77 లక్షల దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్ల 77 లక్షల 29 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 1,73,790 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...3,617 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 2,84,601మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247గా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 22,28,724. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,51,78,011గా ఉంది. కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా మొత్తం 3,22,512 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు90.80 శాతం కాగా.. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.04 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో మరణాల రేటు 1.16 శాతంగా నమోదు అయ్యింది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 30,62,747 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా అత్యధికంగా రికార్డ్ స్థాయిలో నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,80,048గా ఉంది.

Share this on your social network: