ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతం

Published: Friday July 02, 2021

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లా హంజిన్ రాజ్‌పొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో హవాల్దార్ అమరుడయ్యారని జమ్మూకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. మరో ఉగ్రవాది కోసం సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.