ఏపీలో కొత్తగా 2,925 కరోనా కేసులు

Published: Saturday July 10, 2021

ఏపీలో కొత్తగా 2,925 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 26 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,20,178à°•à°¿ కరోనా కేసులు చేరగా, కరోనాతో 12,986 మంది మరణించారు. అలాగే 29,262 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,77,930 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 3,937 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో 24 గంటల్లో 95,366 కరోనా టెస్టులు నిర్వహించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, à°•à°¡à°ª, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.