ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు

Published: Sunday July 11, 2021

ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 16 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 19,22,843కి చేరగా, కరోనాతో 13,002 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్ కేసులు ఉండగా, 18,81,161 మంది రికవరీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 4, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 2, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.