ఏపీలో కొత్తగా 1,578 కరోనా కేసులు
Published: Monday July 12, 2021

ఏపీలో కొత్తగా 1,578 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 22 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 19,24,421కి చేరగా, కరోనాతో 13,024 మంది మరణించారు. 27,195 యాక్టివ్ కేసులు ఉండగా, 18,84,202 మంది రికవరీ అయ్యారు. అలాగే 24 గంటల్లో 3,041 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 62,657 కరోనా టెస్టుల నిర్వహించారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Share this on your social network: