ఏపీలో 2,526 కరోనా కేసులు
Published: Thursday July 15, 2021

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 19,32,105కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 24 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 13,081 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 25,526 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 18,93,498 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 2,933 మంది రికవరీ అయ్యారు.
కొత్తగా ప్రకాశం జిల్లాలో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

Share this on your social network: