రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

Published: Saturday July 24, 2021

రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా కానుక ప్రారంభించడంతో పాటు నూతన విద్యావిధానంపై అదే రోజు సమగ్రంగా వివరించనుంది. విద్యాశాఖలో ‘నాడు-నేడు’, అంగన్‌వాడీలపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.à°ˆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడత ‘నాడు-నేడు‘ పనులను అదేరోజు ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. అనంతరం రెండో విడత పనులకు కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ‘‘పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావుండకూడదు. ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ లేదు. పారదర్శకంగా పనులు సాగాలి. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు’’ అని జగన్‌ స్పష్టం చేశారు. నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు, మెరుగులు దిద్దే ప్రక్రియను పూర్తిచేసి ఆగస్టు 16à°¨ విధివిధానాలు వెల్లడించాలని ఆదేశించారు. కొత్త విద్యావిధానంలో పీపీ-1 నుంచి 12à°µ తరగతి వరకూ ఆరు రకాల స్కూళ్లు వస్తాయన్నారు. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు(పీపీ-1, పీపీ-2), ఫౌండేషన్‌ స్కూళ్లు(పీపీ-1, పీపీ-2, 1, 2 తరగతులు), ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5 తరగతులు), ప్రీ హైస్కూళ్లు(పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు), హైస్కూళ్లు(3 నుంచి 10à°µ తరగతి వరకూ), హైస్కూల్‌ ప్లస్‌(3నుంచి 12à°µ తరగతి వరకూ) రానున్నాయని సీఎం వివరించారు.

 

‘‘శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుంది. కిలోమీటరు లోపలే ఫౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుంది. 3à°•à°¿.మీ. పరిధిలో హైస్కూల్‌ ఉంటుంది. à°† పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నాం’’ అని జగన్‌ పేర్కొన్నారు. ‘‘ఉపాధ్యాయులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడమే నూతన విద్యావిధానపు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం 5à°µ తరగతి వరకూ ప్రతి టీచర్‌ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు. కొన్నిచోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరి కొన్నిచోట్ల నలుగురికి ఒకే టీచర్‌ బోధిస్తున్న పరిస్థితి ఉంది. నూతన విధ్యావిధానంలో à°ˆ పరిస్థితుల్లో మార్పు తెస్తున్నాం. 5à°µ తరగతి వరకు 18సబ్జెక్టులను బీఈడీ, పీజీ చేసిన టీచర్లతో బోధన అందించబోతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు à°’à°• టీచర్‌ రాబోతున్నారు’’ అని సీఎం చెప్పారు.