టోక్యో హీరోలకు ఘన స్వాగతం భారీగా తరలివచ్చిన అభిమానులు

దేశ ఒలింపిక్స్లో చరిత్రలోనే టోక్యో క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత జట్టు.. స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సహా సోమవారం స్వదేశానికి చేరుకుంది. తమ అభిమాన క్రీడాకారులను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఎయిర్పోర్టులో ఎక్కడలేని కోలాహలం ఏర్పడింది. భారత క్రీడా ప్రాఽథికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ చీఫ్ అదిల్ సుమరివాలా ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికింది. స్థానిక రాజకీయ నాయకులతోపాటు, ఫ్యాన్స్ ఎయిర్పోర్టు లోపల, బయట చప్పట్లు చరుస్తూ మన హీరోలను స్వాగతించారు. ఇక దారి పొడవునా పెద్దఎత్తున బారులు తీరిన ప్రజలు మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ, డోలు, ఇతర బ్యాండు వాయిద్యాలతో హోరెత్తిస్తూ, పాటలు పాడుతూ రెండు వారాలుగా పడిన కఠోర శ్రమను, ఒత్తిడిని మరిచేలా అథ్లెట్లను ఉత్సాహపరిచారు.
టోక్యో ఒలింపిక్స్లో మన అథ్లెట ప్రతిభ దేశ క్రీడా సత్తాకు నిదర్శనంగా క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అభివర్ణించారు. విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను సాయంత్రం ఇక్కడ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనురాగ్ ప్రసంగిస్తూ.. ‘టోక్యో గేమ్స్ భారత క్రీడా చరిత్రలో ఎన్నో మైలురాళ్లకు వేదికైంది. ఒలింపిక్స్లో మన విజయం నయా భారత్ క్రీడా రంగంలోనూ ఆధిపత్యం చూపగలదని నిరూపించింది’ అని ఆయన అన్నారు.
పతక విజేతలకు మంత్రి శాలువాలు కప్పి సన్మానించడంతో పాటు మెమొం టోలు అందజేశారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ..‘ఇది ఆరంభం మాత్రమే. క్రీడల్లో భారత్ శక్తిగా ఎదుగుతోంది. 2028 ఒలింపిక్స్ కల్లా అగ్రగా మిగా మారడం ఖాయం’ అని ధీమా వ్యక్తం జేశారు. ఇంతకుముందే స్వదేశానికి చేరుకున్న సింధు, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అత్యంత ఆహ్లాదభరితంగా సాగిన కార్యక్రమంలో తొలుత కాంస్య పతకం నెగ్గిన పురుషుల హాకీ జట్టుతో పాటు మహిళల జట్టు కేక్ కట్ చేసింది.

Share this on your social network: