రాజకీయ నేతల కేసుల్లో జాప్యం..

Published: Wednesday August 25, 2021

చట్ట సభల సభ్యులపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. ఈడీ కేవలం ఆస్తులను జప్తు చేయడం మినహా ఇంకేమీ చేయడం లేదని మండిపడింది. 

 

పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడానికి సత్వర విచారణలు అవసరమని చెప్పారు. à°ˆ సంస్థలకు వ్యతిరేకంగా తాము మాట్లాడాలని అనుకోవడం లేదని, వాటి నైతిక బలాన్ని తగ్గించాలని కోరుకోవడం లేదని అన్నారు. అయితే పెండింగ్ కేసుల సంఖ్య అనేక అంశాలను వెల్లడిస్తుందన్నారు. దురుద్దేశాలతో నమోదయ్యే కేసులను ఉపసంహరించుకోవడం తప్పేమీ కాదని, అయితే à°ˆ ప్రక్రియను సంబంధిత రాష్ట్ర హైకోర్టు పరిశీలించాలన్నారు. 

 

ఆశ్చర్యం వ్యక్తం చేసిన జస్టిస్

కోర్టుకు సహాయపడుతున్న అమికస్ క్యూరీ విజయ్ హన్సరియా మాట్లాడుతూ, à°“ కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థ 2030నాటికి à°† దర్యాప్తు ముగుస్తుందని చెప్పిందన్నారు. దీంతో à°ˆ ధర్మాసనంలోని మరొక న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘మై గాడ్!’’ అన్నారు. పదేళ్ళకుపైగా గడిచిపోయినప్పటికీ, దర్యాప్తు పూర్తి కాని కేసులు సుమారు 50 శాతం ఉన్నాయని విజయ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 

 

భారం ఉందని తెలుసు

జస్టిస్ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పందిస్తూ, జాప్యం జరుగుతుండటానికి కారణాలను దర్యాప్తు సంస్థలు చెప్పడం లేదని పేర్కొంది. కోర్టుల మాదిరిగానే దర్యాప్తు సంస్థలకు కూడా సిబ్బంది కొరత ఉందని పేర్కొంది. కేసు చిన్నదైనా, పెద్దదైనా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నారని వ్యాఖ్యానించింది. కోర్టుల మాదిరిగానే ఈ సంస్థలపై కూడా భారం ఉన్నట్లు అర్థం చేసుకోగలమని పేర్కొంది. కొన్ని కేసుల్లో ఈ సంస్థలు ప్రత్యేక పద్ధతులను అవలంబించవలసి ఉంటుందని, వనరులు అవసరమవుతాయని పేర్కొంది. అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని తెలిపింది.