ఇతర దేశాలు జోక్యం కూడదు..తాలిబన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ టురబి హెచ్చరిక

Published: Friday September 24, 2021

 à°‡à°¸à±à°²à°¾à°®à°¿à°•à± చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆఫ్ఘనిస్థాన్ నూతన పాలకులు స్పష్టం చేశారు. ఉరితీతలు, చేతులు నరకడాలు వంటి శిక్షలను పునరుద్ధరిస్తామని తెలిపారు. అయితే ఇటువంటి శిక్షలను బహిరంగంగా అమలుపరచాలా? వద్దా? అనే అంశంపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. తమ పాలనలో ఇతర దేశాలు జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు. తాలిబన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ టురబి à°“ వార్తా సంస్థతో మాట్లాడుతూ à°ˆ వివరాలు తెలిపారు. 

 
ఆఫ్ఘనిస్థాన్ నూతన పాలకుల పాలనలో జోక్యం చేసుకోరాదని ప్రపంచాన్ని టురబి హెచ్చరించారు. à°—à°¤ తాలిబన్ పాలనలో ఉరితీతలపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలను తోసిపుచ్చారు. స్టేడియంలలో తాము అమలు చేసిన శిక్షల గురించి ప్రతి ఒక్కరూ విమర్శించారని, కానీ తాము ఎన్నడూ వారి చట్టాలు, శిక్షల గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు. ‘‘మా చట్టాలు ఎలా ఉండాలో ఎవరూ చెప్పకూడదు. మేము ఇస్లాంను అనుసరిస్తాం. ఖురాన్ ఆధారంగా మేం చట్టాలు చేస్తాం’’ అన్నారు. న్యాయమూర్తులు కేసులపై విచారణ జరిపి తీర్పులిస్తారన్నారు. ఆఫ్ఘనిస్థాన్ చట్టాలకు పునాది ఖురాన్ అని చెప్పారు. గతంలో అమలు చేసిన శిక్షలను పునరుద్ధరిస్తామన్నారు. చేతులను నరకడం భద్రత కోసం చాలా అవసరమని చెప్పారు. ఇది నిరోధక చర్య అని చెప్పారు. శిక్షలను బహిరంగంగా అమలు చేయాలా? అనే విషయంపై కేబినెట్ అధ్యయనం చేస్తోందన్నారు. దీనికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధిపరుస్తామన్నారు. 

తాలిబన్లు 1996-2001 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌ను పరిపాలించినపుడు కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో లేదా ఈద్గా మసీదు మైదానంలో శిక్షలను అమలు చేసేవారు. వందలాది మంది చూస్తుండగా శిక్షలు అమలయ్యేవి. బాధితుల కుటుంబ సభ్యులు దోషి తలలోకి కాల్చి చంపడం వంటి పద్ధతులను అనుసరించేవారు. ఒక్కొక్కసారి బాధితుల కుటుంబ సభ్యులు ‘‘బ్లడ్ మనీ’’ తీసుకుని, దోషిని సజీవంగా వదిలిపెట్టే అవకాశం ఉండేది. దొంగలకు చేతులను నరికేవారు. హైవేలపై దోపిడీకి పాల్పడినవారి చేతిని, కాలిని నరికేవారు. అయితే విచారణలు, దోషిత్వ నిర్థరణలు బహిరంగంగా జరగడం అరుదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇస్లామిక్ మత పెద్దలకు అనుకూలంగా ఉంటుంది. à°ˆ మత పెద్దలకు న్యాయశాస్త్రంలో నైపుణ్యం ఉండదు.