పక్కా ప్లాన్‌తో ట్రాప్ చేసి ఇరికించారా..?

Published: Monday October 04, 2021

ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటు పట్టుబడటంతో ఆర్యన్ ఖాన్ సహా 8 మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)  అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. పార్టీకి వెళ్లకూడదని అతడు భావించినప్పటికి దగ్గరి మిత్రుడి ప్రోద్బలంతోనే అక్కడికి వెళ్లి à°’à°• ఉచ్చు(ట్రాప్)లో చిక్కుకున్నట్లు అతడి తరఫు సన్నిహిత వర్గాలు వాదిస్తున్నాయి.

ఎన్సీబీ అధికారులు క్రూయిజ్ షిప్‌పై  దాడి చేసినప్పుడు 1000మందికి పైగా అక్కడ ఉన్నట్టు సమాచారం. కానీ, పోలీసులు 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. ఆర్యన్ à°ˆ పార్టీకి వెళ్లకూడదనుకున్నాడు. కానీ, à°’à°• దగ్గరి మిత్రుడు పార్టీకి రమ్మని బలవంతం చేయడంతో అక్కడికి వెళ్లాడని సన్నిహితులు తెలుపుతున్నారు. అంతమందిని వదిలిపెట్టి కేవలం 8 మందిని మాత్రమే అరెస్టు చేయడంతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్యన్ తరఫు న్యాయవాది మనీశ్ షిండే తన వాదనలు వినిపిస్తూ..‘‘ పార్టీకి వెళ్లడానికి ఆర్యన్‌కు టిక్కెట్ లేదు. అతడి ఫోన్‌ను చెక్ చేసినప్పటికి ఏమీ బయట పడలేదు. ఎన్సీబీ అధికారులు వీరిని మాత్రమే అరెస్టు చేశారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ’’ అని  చెప్పారు.మీడియా కథనాల ప్రకారం..à°’à°• దగ్గరి మిత్రుడు పార్టీకి వెళ్దామని చెప్పడంతోనే అతడు అక్కడికి వెళ్లాడు. ఆర్యన్‌కు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి దాడి చేయడానికి వెళ్లారు.  à°† సమయంలో షిప్‌లో 1000మందికి పైగా ఉన్నప్పటికి 8 మందిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్యన్ తన పేరు మీద క్రూయిజ్ షిప్‌లో రూమ్‌ను కూడా బుక్ చేసుకోలేదు. కానీ, పార్టీ నిర్వహకులు ఆర్యన్, అర్బాజ్ మర్చంట్‌లకు కాంప్లిమెంటరీ రూమ్‌లు ఇచ్చారు. à°† రూమ్‌లోకి వారు వెలుతున్నప్పుడు ఏన్సీబీ అధికారులు ఆకస్మాత్తుగా దాడి చేసి వారిని అరెస్టు చేశారు. పోలీసులు వారిని సోదా చేసినప్పుడు ఆర్యన్ వద్ద ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు. కానీ, అర్బాజ్ మర్చంట్ షూస్‌లో చరస్ పౌడర్ లభించింది. కొత్తవారితో పార్టీకి వెలుతున్నట్టు ఆర్యన్ ఇంట్లో కూడా చెప్పలేదు. అందువల్ల అరెస్టు అనంతరం వెంటనే షారూఖ్ మేనేజర్‌కు ఫోన్ చేశారు.