భారత్‌లో ఒమైక్రాన్ ప్రవేశం...

Published: Thursday December 02, 2021
 

న్యూఢిల్లీ : à°¤à±€à°µà±à°° కలకలం రేపుతున్న కోవిడ్-19 వైరస్ కొత్త రూపాంతరం ఒమైక్రాన్ భారత్‌లో ప్రవేశించింది. కర్ణాటకలో ఇద్దరికి ఇది సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ధ్రువీకరించింది. వేగంగా వ్యాపించే à°ˆ కేసులు మన దేశంలో నమోదవడం ఇదే తొలిసారి. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. à°ˆ రెండు కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు à°ˆ వైరస్ బాధితులని తెలిపారు. à°µà±€à°°à°¿à°²à±‹ ఒకరు నవంబరు 11à°¨, మరొకరు నవంబరు 20à°¨ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిపారు. à°…యితే ఒమైక్రాన్ లక్షణాలు మన దేశంలో ఇప్పటి వరకు మరీ à°…à°‚à°¤ తీవ్రంగా లేవని చెప్పారు. à°ˆ వైరస్‌కు సంబంధించిన కేసులన్నిటిలోనూ చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన à°ˆ కేసుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలపై అధ్యయనం జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. 

 

ఒమైక్రాన్ రూపాంతరాన్ని మొదట దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో గుర్తించారు. à°† తర్వాత ఇది సుమారు 10 దేశాలకు వ్యాపించింది. ఇది మరింత విస్తరించకుండా మన దేశం à°•à° à°¿à°¨ చర్యలు అమలు చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి పెట్టింది. 

 

ఇదిలావుండగా, కర్ణాటకలో ఒమైక్రాన్‌కు గురైనవారు ఇద్దరూ విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది