యుద్ధం నేపథ్యంలో కేంద్ర కేబినెట్తో మోదీ అత్యవసర సమావేశం
Published: Thursday February 24, 2022

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Share this on your social network: