కూలిన శిక్షణ విమానం
Published: Saturday February 26, 2022

జిల్లాలో శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పెద్దవూర మండలం తుంగతుర్తి దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది.. ప్లైటెక్ ఏవియేషన్ అకాడమీకి చెందిన విమానంగా గుర్తించారు. ట్రైనింగ్ విమానం మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలెట్ ఉన్నారు. దట్టమైన పొగతో ఈ ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు.
గతంలో ఫ్లైటెక్ ఏవియేషన్పై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఆ సమయంలో సీబీఐ, ఈడీ, బీఆర్ఐ సంస్థల విచారణ కూడా జరిగింది. ట్రైనింగ్లో సరైన ప్రమాణాలు పాటించడంలేదని అటు ఏవియేషన్ డైరెక్టర్కు కూడా చాలా ఫిర్యాదులు అందాయి. రెండేళ్ల క్రితం ఫ్లైటెక్ ఏవియేషన్లో డీజీసీఐ తనిఖీలు నిర్వహించింది.

Share this on your social network: