ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారయత్నం

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై ఆ బస్సు డ్రైవరే అత్యాచారయత్నం చేశాడు. అయితే, మరో ప్రయాణికుడి సాయంతో ఆమె డ్రైవర్ కీచకపర్వం నుంచి బయటపడింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. నెల్లూరు నుంచి బుధవారం రాత్రి ఇంద్ర ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు ఒంగోలు వచ్చే సరికి అందులో ఓ మహిళ, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. అప్పటి వరకు డ్రైవింగ్ చేసిన ఎ.జనార్దన్ బస్సును మరో డ్రైవర్కు అప్పగించాడు. తర్వాత లైట్లు ఆపేసి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించడంతో ఆమె నోరు మూసేసి బలాత్కారానికి తె గబడ్డాడు. తర్వాత గుంటూరులో ఒక ప్రయాణికుడు దిగిపోయాడు. తర్వాత డ్రైవర్ మళ్లీ ఆమెను బలాత్కరించేందుకు ప్రయత్నించగా ఆమె మరో ప్రయాణికుడి వద్దకు వెళ్లి రక్షించాల్సిందిగా ప్రాధేయపడింది. అతడు డ్రైవర్ను మందలించేందుకు ప్రయత్నించగా అతడిపైనా విరుచుకుపడ్డాడు. ఈలోగా ఆమె అనకాపల్లిలోని తన భర్తకు ఫోన్చేసి విషయాన్ని చెప్పింది. వెంటనే భర్త విజయవాడలో తాను పనిచేసే మార్కెటింగ్ కంపెనీ మేనేజర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ మేనేజర్ హుటాహుటిన పీఎన్బీఎ్సకు కారులో వచ్చారు. సరిగ్గా బస్సు అక్కడికి రాగా, ఆమెను రక్షించి బయటకు తెచ్చారు. డైవర్ జనార్ధన్పై బాధితురాలు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డ్రైవర్ జనార్దన్కు డ్యూటీ నిలుపుదల చే

Share this on your social network: