గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్

Published: Wednesday March 23, 2022

మరోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయిని తెలియజేసేందుకు దర్శకధీరుడు తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం- రణం-రుధిరం) చిత్రం మార్చి 25à°¨ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర బృందం.. నేడు(బుధవారం) హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు.. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. 

à°ˆ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి, పర్యావరణం‌కు సంబంధించిన ఏ కార్యక్రమమైనా నా మనసుకు ఎంతో దగ్గరగా ఉంటాయి. వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తూనే ఉన్నాము. రాష్ట్రం, దేశం పచ్చగా ఉండాలనే సంతోష్‌గారి సంకల్పం చాలా గొప్పది. ఇది మరింత విజయవంతం కావాలి. గతంలో బాహుబలి టీమ్‌తో కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొవడం జరిగింది. ఇప్పుడు మరోసారి à°ˆ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. 

 

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలి అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. à°ˆ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో.. మొక్కలనూ అలాగే నాటి రక్షించాలి అని ఎన్టీఆర్ కోరారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. గతంలో కూడా à°ˆ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఇలా మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుంది, ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా à°ˆ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతృప్తిగా ఉంది.. అని అన్నారు

 

సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ à°ˆ కార్యక్రమంలో అభినందించింది. అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైంది. సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుంది. మూవీ రిలీజ్ షెడ్యూల్‌లో బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని తెలిపారు.