గత ఆర్థిక సంవత్సరం లో 63 శాతం పెరిగిన డీమ్యాట్ ఖా తాలు
దేశంలో యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా పెరిగింది. డిపాజిటరీల డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డీమ్యాట్ ఖాతాలు ఏకంగా 63 శాతం పెరిగి దాదాపు 9 కోట్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈక్విటీ మార్కెట్ల ఆకర్షణీయ ప్రదిఫలాలు, స్మార్ట్ఫోన్ ద్వారా ట్రేడింగ్ పెరుగడం ఇందుకు ప్రధాన కారణంగా భావించబడింది. ఈ ఎడాది మార్చి 31 నాటికి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) నిర్వహణలోని యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 6.3 కోట్లకు చేరుకుంది. ఆ ఖాతాలు కస్టడీ ఆసెట్ (ఎయూఎం) మొత్తం విలువ 37.2 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) నిర్వహణలోని యాక్టివ్ డీమ్యాట్ ఖాతాలు 2.67 కోట్లకు పెరిగాయి. వాటిల్లోని ఎయూఎం విలువ రూ.301.87 లక్షల కోట్లుగా ఉంది. మరిన్నివివరాలు..
2020లో కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి దేశంలో డీమ్యాట్ ఖాతాలు 2.2 రెట్లు పెరిగగా.. వాటిల్లోని మొత్తం ఆసెట్ విలువ కూడా రెండు రెట్లు పెరిగింది. కొత్త డీమ్యాట్ ఖాతాదారుల్లో అధికంగా యువతే కావడం గమనార్హం.
కరోన వ్యాప్తితో ప్రారంభమయ్యాక, పెట్టుబడి అవసతలలోనూ మార్పులు వచ్చాయి. దేశంలో సామాన్యులకు స్మార్ట్ఫోన్లు విరివిగా అందుబాటులోకి రావడం వచ్చాయి. పైగా డేటా సేవలు చౌకగా లభిస్తున్నాయి. దాంతో అప్స్స్టాక్స్, జీరోధా వంటి బ్రోకరేజ్ సేవల కంపెనీలు ఆన్లైన్లో డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు ట్రేడింగ్ జరిపే ట్రెండ్ ఊపందుకున్నది.
ఈ-కేవైసీ, ఆధార్ ఈ-సిగ్నేచర్ వంటి సౌకర్యాలు ఆన్లైన్లో డీమ్యాట్ ఖాతా ఓపెనింగ్ ప్రక్రియను సులభతరం చేశాయి.
2020 మార్చి నుంచి గత ఏడాది చివరివరకు స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 19 శాతం ఎగబాకగా.. మిడ్క్యాప్ సూచి 25 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 29 శాతం పుంజుకున్నాయి.
Share this on your social network: