కరుణానిధి మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన బాలయ్య

Published: Wednesday August 08, 2018

డీఎంకే అధినేత కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేదని బాలయ్య గుర్తుచేసుకున్నారు. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదన్నారు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు ఈరోజు తమ మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన లోటు తీర్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు బాలకృష్ణ తన ప్రగాఢ సానుభూతి తెలియజేయజేశారు.