రైల్వే పిలుపునకు అనూహ్య స్పందన

Published: Saturday September 01, 2018

విజయవాడ: à°°à°‚à°¡à°¿... కేరళ వరద బాధితులకు సహాయం చేద్దాం... మాతో చేతులు కలపండి అని, దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన పిలుపునకు దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. జోన్‌ పరిధిలోని విజయవాడ డివిజన్‌తో పాటు మిగతా ఐదు డివిజన్‌à°² నుంచి ఇప్పటి వరకు 520 టన్నుల వస్తు, ఆహార సామగ్రిని ఉచి తంగా కేరళకు రవాణా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. 75 టన్నుల బియ్యం, ఐదు టన్నుల గోధుమ పిండి, 9 టన్నుల పప్పు, చక్కెర, ఉప్పు, బెల్లం, వంట నూనె, స్నాక్స్‌, వాటర్‌ బాటిళ్లు, బిస్కెట్లు, పచ్చళ్లు, కూరగాయలు తదితర వస్తువులు దాతలు అందజేశారు. విజయవాడతో పాటు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు, గుంతకల్‌, à°•à°¡à°ª, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నాందేడ్‌ ప్రాంతాల్లోని రైల్వే పార్శిల్‌ కార్యాలయాలలో దాత లు అందజేసే వస్తు సామగ్రి కోసం ప్రత్యేకంగా కౌంటర్‌లు కూడా ఏర్పాటు చేశారు. దాతలు ముందుకు వస్తే తాము ప్రత్యేక పార్శిల్‌ లో వస్తుసామగ్రిని కేరళకు పంపించటానికి సిద్ధమన్నారు.