విశాఖలో జంట హత్యలు....

Published: Saturday October 13, 2018
విశాఖపట్నం: à°µà°¿à°¶à°¾à°–లో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకవైపు కత్తులతో పరిగెడుతూ రోడ్డుపై పరిగెడుతున్న గ్యాంగ్, మరోవైపు చిన్న విషయానికే పోట్లాడి à°’à°• వ్యక్తి మరణానికి కారణమైన సంఘటనలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖలోని నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌గేట్ వద్ద à°“ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని అతికిరాతంగా హత్య చేసిన దుండగులు మొండెం నుంచి తలను వేరు చేశారు. మృతుడు తమిళనాడుకు చెందిన నీలిమేఘ అమరన్‌à°—à°¾ గుర్తించారు. à°ˆ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కాగా యలమంచిలి సమీపంలో పెద్దపల్లి వద్ద ఆరుగురు వ్యక్తులు కత్తులు పట్టుకుని పరిగెడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని పోలీసులు వెంబడించారు. పెద్దపల్లి వద్ద పోలవరం కాలువ పనుల్లో భాగంగా à°“ వైపు రోడ్డును మూసి వేశారు. ఇది తెలియని నిందితుల కారు à°† దారిలో రావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వేంపాడు టోల్‌గేట్ వద్ద యువకుడిని హత్య చేసింది వీరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. à°ˆ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను పోలీసులు ఇదే గ్యాంగ్‌కు సంబంధించి మరో ఐదుగురు సమీపంలో దాక్కుని ఉంటారన్న సమాచారం గాలింపు చేపట్టారు. దుండుగులు వదిలేసిన కారు నెంబర్ కూడా తమిళనాడు చెందినదిగా తెలుస్తోంది. à°ˆ హత్యకు కారులో వచ్చిన వ్యక్తులే చేసుంటారనే అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు జల్లడపడుతున్నారు.
 
మరోవైపు విశాఖ జగదాంబ సెంటర్లో మరో హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. జగదాంబ జంక్షన్ ఓ ఆప్టెక్స్ సమీపంలో శ్రీరాములు అనే వ్యక్తి పువ్వుల దుకాణం నడుపుతున్నారు. ఇందులో రెల్లివీధికి చెందిన సైకో శ్రీను, కొబ్బరి తోటకు చెందిన నూకరాజు అనే ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను, నూకరాజు ఘర్షణకు దిగారు. ఇదే సమయంలో నూకరాజుపై శ్రీను కత్తితో
 
దాడి చేశాడు. ఈ ఘటనలో నూకరాజు మెడకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో
 
చికిత్స పొందుతూ నూకరాజు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.