జగన్, పవన్‌కు ఆ దమ్ముందా?

Published: Tuesday October 16, 2018
విజయవాడ: à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారని, జగన్‌ పాదయాత్రలో ఉన్నా ప్రాజెక్టును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం à°…à°¡à°¿à°—à°¿à°¨ పత్రాలన్నీ పంపుతూనే ఉన్నామన్నారు. ఇప్పటి వరకు లక్షా 47వేల మంది ప్రాజెక్టు చూసి వచ్చారని, అయితే జగన్ జగన్‌ ఒక్కసారి కూడా ప్రాజెక్టు చూడకపోవడం శోచనీయమని విమర్శించారు. 108 వాహనాలపై జగన్‌ నాటకాలంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం పదవిపై ఆశతో జగన్‌ సందుల్లో తిరుగుతున్నారని మంత్రి మండిపడ్డారు. 2019లో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యాఖ్యానించారు.
 
57 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఇప్పటికే 15 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 16 కొత్త ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణం జరిగే తీరును ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామన్నారు. ప్రపంచంలో ఎవరైనా లెక్కలు చూసుకోవచ్చని దేవినేని వెల్లడించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచుకొని జగన్‌ జైలుకు వెళ్ళాడని ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయంపై  కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము పవన్ కళ్యాణ్, జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. కవాతులు, ప్రదర్శనలు జాతీయ రహదారిపై చేసుకోండని..బ్యారేజీలపై కాదని మంత్రి దేవినేని ఉమ సూచించారు.