వైఎస్ జగన్‌పై కత్తితో దాడి

Published: Thursday October 25, 2018

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్‌పై చందన శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్.. కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సహాయకులు అడ్డుకోవడంతో జగన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. à°ˆ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోని à°“ హోటల్‌లో వెయిటర్‌à°—à°¾ పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్‌ బయలుదేరారు.