దేశ, రాష్ట్ర ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యం

Published: Tuesday November 13, 2018

దేశ, రాష్ట్ర ప్రయోజనాలే టీడీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చు చేస్తూ 100 రూపాయలు పెట్టుబడి తీసుకువస్తున్నారన్నారు. పురందేశ్వరి కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నపుడు, బీజేపీలో పదవులు పొందినపుడు ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషించలేదా అని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలే టీడీపీకి, ముఖ్యమంత్రికి ముఖ్యమని, రాజకీయాలు కాదని చెప్పారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తన ఉనికి కోసమే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారనిన్నారు. బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కోసమే జీవీఎల్‌ తపన అని విమర్శించారు. మోదీ ఇష్టానుసారంగా విదేశి పర్యటనలు చేసినప్పుడు జీవీఎల్‌à°•à°¿ కనపడదా, రాఫెల్‌ కుంభకోణంపై సమాధానం చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. దేశదిమ్మరిలా ఎవరు తిరుగుతున్నారో ఒకసారి బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.