ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్‌ పరీక్షలు.....గంటా

Published: Thursday November 15, 2018

ఇంటర్మీడియెట్‌ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 27నుంచి నిర్వహించనున్నట్టు మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం విశాఖలో ఆయన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసి మాట్లా డారు. థియరీకి సంబంధించి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 27నుంచి మార్చి 16వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28నుంచి మార్చి 18వరకు జరుగుతాయన్నారు. రెండేళ్లకూ కలిపి 10.64లక్షల మంది విద్యార్థులున్నారని, వీరికోసం 1,448పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1నుంచి 20వరకు జరుగుతాయన్నారు. తెలంగాణలో కూడా ఇంటర్‌ పరీక్షలు ఏపీతోపాటే జరుగుతాయని వెల్లడించారు. గతేడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అమలుచేసిన గ్రేడింగ్‌ విధానం ఈసారి రెండో ఏడాది విద్యార్థులకు కూడా వర్తింపజేసి సీజీపీఏ ఇస్తామన్నారు. ఇంటర్‌బోర్డు ఏర్పాటుచేసి 50 ఏళ్లు పూర్తయినందున డిసెంబరు 3à°¨ స్వర్ణోత్సవం నిర్వహిస్తామన్నారు.