అమరావతికి 6 ప్రముఖ ఆసుపత్రులు

Published: Saturday November 17, 2018
ముంబైకి చెందిన ప్రముఖ ఆసుపత్రి లీలావతితో పాటు మరో అయిదు అతిపెద్ద ఆసుపత్రులు అమరావతికి త్వరలో రానున్నట్లు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఇటీవల ప్రాథమిక వైద్య, కుటుంబ సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఇతర మంత్రులు చినరాజప్ప, లోకేష్‌, అఖిలప్రియ, ఎంపీ రామ్మోహననాయుడు, ఎమ్మెల్యే అశోక్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు. à°ˆ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల రాష్ట్రంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
అరకులో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ధి చేయాలని పర్యాటకమంత్రి అఖిలప్రియను మంత్రి శ్రావణ్‌ కోరగా, ఆమె అంగీకరించారు. అరకులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను ప్రారంభించాలని శ్రావణ్‌ కోరగా డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని లోకేశ్‌ చెప్పారు.