షెడ్యూల్‌ సవరించాలంటున్న డీఎస్సీ అభ్యర్థులు

Published: Sunday November 25, 2018
డీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్‌లో చేసిన మార్పుల ఫలితంగా పలువురు అభ్యర్థులు ఒకేరోజు రెండు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. à°† రెండు పరీక్షలు ఒకే సెంటర్‌లో అయితే ఫర్వాలేదు కానీ... అవి వేర్వేరు ప్రదేశాల్లోని సెంటర్లలో అయితే కచ్చితంగా à°’à°• పరీక్షను వదులు కోవాల్సిందే! డీఎస్సీ-2018à°•à°¿ సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్స్‌(తెలుగు), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (తెలుగు) రాత పరీక్షలు డిసెంబరు 12à°¨ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ముందస్తు అవగాహనా లేకుండా ఆన్‌లైన్‌లో షెడ్యూల్‌ను ఉంచింది. à°ˆ రెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు... వేర్వేరు సెంటర్లలో పరీక్ష రాయాల్సి వస్తే ఏదో à°’à°• దాన్ని వదులు కోవాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్వాకం వల్ల à°ˆ సమస్యను ఎదుర్కొంటున్నారు. à°ˆ విషయమై తక్షణమే అధికారులు స్పందించి పరీక్షల షెడ్యూల్‌ను అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా సవరించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.