షోకాజ్ నోటీస్‌కు సమాధానంగా.. ప్రశ్నల వర్షం

Published: Thursday June 25, 2020

పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలకు పాల్పడుతున్నారని.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ షోకాజ్ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. పార్టీ తరుఫున షోకాజ్ నోటీస్ పంపిన విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

 

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చిన à°ˆ షోకాజ్‌కు చట్టబద్ధత లేదు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? à°®à±€à°Ÿà°¿à°‚గ్ ఎప్పుడు పెట్టారు? ఏమి తీర్మానం చేశారో తెలియజేయండి. క్రమశిక్షణ సంఘం మినిట్స్ నాకు పంపండి. షోకాజ్ ఎవరు జారీ చెయ్యాలి? ప్రొసీజర్ తెలుసా?’’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రఘురామ కృష్ణంరాజు సూటిగా నిలదీశారు. à°¦à±€à°¨à°¿à°•à°¿ సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) IV-A భాగం, సెక్షన్ 29 ఎలోని 1à°µ అంశాన్ని లేవనెత్తారు.

 
పార్టీ పేరులో ఉన్న వైఎస్సార్ అనే పదాన్ని తన లెటర్ హెడ్స్‌లో విజయసాయి రెడ్డి ఉపయోగించడం పార్టీ అధినేత జగన్‌కు తెలుసా? అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ఎన్నికల నియమావళికి భిన్నమైన రీతిలో షోకాజ్ వచ్చిందంటూ ఇది అందరినీ తప్పుదారి పట్టించడమేనన్నారు. ఇందుకు చట్టరీత్యా ప్రతిస్పందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. à°ˆ అంశాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం రూపొందించిన 1968 నాటి ఎన్నికల చిహ్నాల రిజర్వేషన్, కేటాయింపు ఆర్డర్, భారత రాజ్యాంగంలోని 324à°µ ఆర్టికల్,  ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) 29-à°Ž సెక్షన్, ఎన్నికల నియమావళిలోని 5, 10 నిబంధనలను పార్టీ దృష్టికి తీసుకువచ్చారు.
 
"అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ" అనే పేరును మరొక పార్టీ నమోదు చేసుకున్నందునే వైఎస్సార్ పేరుతో పార్టీ పేరు దక్కలేదన్న రఘురామకృష్ణం రాజు, మనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. పార్టీ పేరు మార్పిడికి ముందడుగు కూడా పడలేదన్నరు. à°‡à°‚దుకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం (1951)లో సెక్షన్ 29ఎలోని 9à°µ క్లాజును ప్రస్తావించారు.