జగన్ పాదయాత్రకు మరోదారి .......

Published: Sunday June 10, 2018

 à°µà±ˆà°¸à±€à°ªà±€ అధినేత జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్రను రోడ్‌ à°•à°‚ రైల్‌ బ్రిడ్జి మీదుగా కాకుండా మరో మార్గంలో నిర్వహించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా సౌత్‌జోన్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ వైసీపీ నేతలకు నోటీసు ఇచ్చారు. à°ˆ నెల 12à°µ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. à°ˆ నేపథ్యంలో ఎక్కువ మంది పాదయాత్ర చేసేందుకు బ్రిడ్జి కండిషన్‌ బాగోలేదని, మరో మార్గం చూసుకోవాలని సూచించారు. జగన్‌ పాదయాత్ర కోసం, నగరంలో కోటిపల్లి బస్టాండు వద్ద సభ కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా అర్బన్‌ జిల్లా పోలీసులకు వైసీపీ నగర కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు లేఖ రాశారు. దీనికి స్పందించిన డీఎస్పీ రోడ్‌ à°•à°‚ రైలు బ్రిడ్జి 50 ఏళ్ల క్రితం నాటిదని, దాని పారా పెట్రోల్‌ వాల్స్‌ కండిషన్‌ సరిగాలేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుని పాదయాత్ర చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయంగా వేరే మార్గం చూసుకోవాలని à°† నోటీసులో పేర్కొన్నారు.