కంటతడి పెట్టిన రాష్ట్రపతి

Published: Saturday January 27, 2018

గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ కన్నీటి పర్యంతమయ్యారు! అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్ర పతకాన్ని అందజేసిన సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. జమ్ముకశ్మీరులోని బందీపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శరీరంలోకి తూటాలు దిగబడినా లెక్కచేయకుండా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టి వీరమరణం పొందిన వైమానిక దళ కమెండో కార్పొరల్‌ జ్యోతిప్రకాశ్‌ నిరాలాకు కేంద్ర హోంశాఖ అశోక చక్రను ప్రకటించింది. శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో జ్యోతిప్రకాశ్‌ తల్లి మాలతీ దేవి, భార్య సుష్మానంద్‌కు à°ˆ పతకాన్ని అందజేస్తూ రాష్ట్రపతి కోవింద్‌ కంటతడి పెట్టారు. తన జేబురుమాలుతో కళ్లు తుడుచుకున్నారు