సింగర్‌ బేబీకి సీఎం ప్రశంస

Published: Sunday December 09, 2018

వ్యవసాయ కూలీగా ప్రస్థానం ప్రారంభించిన పసల బేబీ.. సినీ పాటలతో లక్షలాదిమంది శ్రోతలను మెప్పించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. పలువురి ప్రశం సలు పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వడిసలేరుకు చెందిన పసల బేబీని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి శనివారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుకు పరిచయం చేశారు. అనంతరం చక్కని స్వరంతో పాట వినిపించిన బేబీని సీఎం సన్మానించారు. సీఎంను కలవడం చాలా అనందంగా ఉందని పసల బేబీ మీడియాకు తెలిపారు.