‘మంత్రి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తాం’

Published: Saturday December 22, 2018
బాపట్ల: à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ఖాళీగా ఉన్న ఏవో, ఏఈవో పోస్టులను భర్తీ చేయాలని, వ్యసాయ విద్య ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కొనసాగింది. à°ˆ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కళాశాల వేళలు కూడా మార్చాలన్నారు.
 
రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ కళాశాల నుంచి కొందరు విద్యార్థులను వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో చర్చలకు పిలిచారని, మంత్రి లిఖితపూర్వకంగా హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల ఆందోళనను నీరుగార్చే యత్నాలకు పూనుకోవడం సరికాదన్నారు.