‘మావాడికి తిక్కసార్‌.. కులం పిచ్చి పట్టింది..

Published: Thursday December 27, 2018

 ‘మావాడికి తిక్కసార్‌.. కులం పిచ్చి పట్టింది..’ అంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. అనంతపురంలో బుధవారం జరిగిన ధర్మపోరా à°Ÿ దీక్షలో పాల్గొన్న జేసీ సీఎం చంద్రబాబు ముందు తనదై à°¨ శైలిలో మాట్లాడారు. ‘ఇదేంది సార్‌ ప్రతి ఒక్కరూ కుల మూ.. కులమూ అంటారు. కులం బువ్వ పెడుతుందా.. ప్రతి ఒక్కడూ కులమే.. మావాడు జగన్‌కూ కులం పిచ్చి పట్టుకుంది. ఒకాయన రెడ్డంటాడు.. ఒకాయన బలిజంటాడు... రెడ్డితో సీఎం అయ్యారా? కమ్మవారితో సీఎం అయ్యావా? బలిజలతో సీఎం అయ్యారా? సార్‌ చెప్పండి.. అందర్నీ కలుపుకుపోతేనే మీరు సీఎం అయ్యారు. జగన్‌కు బుద్ధి లేదు.. పాడు లేదు. కాళ్ల చూపు తప్ప ముందుచూపు లేదు. హిందూపురంలో సీటు కోసం మావాడు.. నవీన్‌నిశ్చల్‌ని 10 కోట్లు అడిగాడని బోరున ఏడుస్తున్నాడు... ఒక్క టిక్కెట్టుకే పది కోట్లిస్తే... 175 మందికి ఎన్ని కోట్లు కావాలి? ఇలాంటోడు సీఎం అయ్యేదీ లేదూ... పోయేది లేదూ. చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యం. సీఎంగా ఆయనుంటేనే హాయిగా నిద్రపోవచ్చు. లేదంటే బెంగళూరు, మైసూరు వెళ్లి కూలీనాలీ చేసుకుని చావాలి. ఆంధ్రప్రదేశ్‌ యావత్‌ చంద్రబాబు వైపు చూస్తోంది. ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రధాని కూడా మనపై కుట్ర పన్నుతున్నారు. మనవాడు మగాడు కాబట్టి à°† కుట్రలను ఎదురొడ్డి పోరాడుతున్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి. కానీ సార్‌.. మీరు 70 సంవత్సరాలకే రిటైర్‌ అవ్వాలి. సార్‌... మళ్లీ బీజేపీ వాళ్లొచ్చి మిమ్మల్ని మద్దతడిగినా.. మీరివ్వడానికి సిద్ధంగా ఉన్నా.. జనం ఒప్పుకోరు.. ఓట్లెయ్యరు’ అంటూ జేసీ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.