పార్టీ పటిష్టతపైనే దృష్టి పెడతా : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

Published: Tuesday January 30, 2018

ఇకపై పార్టీ పటిష్టతపైనే దృష్టి పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షిస్తానని, నియోజకవర్గాలకు ఏ, బీ, సీ, డీ కేటగిరీలు ఇచ్చామన్నారు. అలాగే సి, డి కేటగిరి నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెడతానన్నారు. అలాగే మండల స్థాయి నేతలను నియోజకవర్గ సమావేశాలకు ఆహ్వానిస్తామని, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీలు ఈ సమావేశాలకు హాజరు కావాల్సిందేనన్నారు. ఎన్నికల ఏడాదిలో ఉన్నాం.. ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, జన్మభూమి కమిటీలను పునఃనిర్మించాలని, ఫిబ్రవరి 2న జరిగే పార్టీ సమన్వయ కమిటీలో రాజకీయాలపై చర్చిద్దామని చంద్రబాబు అన్నారు.