పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల నష్టమేమీ లేదు : వైయస్ జగన్మోహన్ రెడ్డి

Published: Thursday February 01, 2018

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతా మాఫియా సామ్రాజ్యమే ఏలుతోందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనపైనా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. గత ఎన్నికల్లోనే పవన్ టీడీపీకి మద్దతు తెలిపారని, అప్పుడు పవన్ అభిమానులు టీడీపీకే ఓటేశారని చెప్పారు. అందువల్ల పవన్ పోటీ చేయడం వల్ల తమ పార్టీకి కొత్తగా ఏర్పడే నష్టమేమీ లేదని జగన్ స్పష్టం చేశారు.


బుధవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. à°ˆ సందర్భంగా ఆయన à°“ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం స్థాయి వరకు అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పొదుపు సంఘాలకు చెందిన వడ్డీ డబ్బులను ప్రభుత్వం కట్టడం లేదని అన్నారు. బ్యాంకుల నుంచి అందే ప్రయోజనాలను అందకుండా చేస్తోందని మండిపడ్డారు. కాగా, à°—à°¤ ప్రభుత్వాలు మాత్రం వడ్డీలు కట్టేవని గుర్తు చేశారు.