పార్లమెంటు నియోజకవర్గాలపై చంద్రబాబునాయుడు కసరత్తు

Published: Monday February 05, 2018

అమరావతి: à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚టు నియోజకవర్గాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. ఈమేరకు సోమవారం నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా... సోమవారం సాయంత్రం 6గంటలకు కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాలపై సీఎం సమీక్ష నిర్వహించనుండగా à°ˆ సమీక్షలో పాల్గొనాల్సిందిగా మొత్తం 32 మంది నేతలకు ఆహ్వానం అందింది. సాధారణ ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశముండడంతో పార్టీ పటిష్టతపై చంద్రబాబు దృష్టి సారించారు. దీనిలో భాగంగా తొలుత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీపై సమీక్షలు జరపనున్నారు.