జనసేన ప్రచార రథాలు రెడీ.

Published: Tuesday January 29, 2019
జనసేన ప్రచార రథాలను à°† పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఎన్నారై జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి వెంబడి నిర్మాణంలో వున్న పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ కార్యాలయం వద్ద ఆయన హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జనసేన పార్టీ గుర్తు, సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించేలా ప్రచార రథాలను సిద్ధం చేశారు. à°ˆ ప్రచార రథాలను గణతంత్ర దినోత్సవం నాడే ప్రారంభించాల్సి వుండగా వాయిదా పడింది.
 
 
రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేందుకు వీటిని సిద్ధం చేశారు. అనంతరం ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో పార్టీ ప్రచార దృశ్యాలను వీక్షించారు. కరపత్రాలను చదువుతూ గాజు గ్లాసులో చాయ్‌ తాగారు. ప్రతి ప్రచార రథం రోజుకు పది గ్రామాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రచార రథాలు రోజుకు 170 గ్రామాల్లో పర్యటించి జనసేన ప్రణాళికలపై ప్రచారం నిర్వహిస్తాయి. ప్రజలు వీక్షించేందుకు ప్రచార రథం లోపల భారీ ఎల్‌ఈడీ స్ర్కీను ఏర్పాటు చేశారు. ప్రచారంలో భాగంగా రథం వద్ద ప్రజలకు పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుతో చాయ్‌ అందించి సభ్యత్వ నమోదు నిర్వహిస్తారు.