సీఎం అభ్యర్థిగా జూ ఎన్టీఆర్ :నారా లోకేష్‌ షాక్

Published: Monday February 05, 2018

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అట్లాంటాలో ఊహించని షాక్ తగిలింది! తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని à°“ ఎన్నారై సూచించారు. తెలంగాణలో టీడీపీ బలపడాలంటే అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. లోకేష్ అట్లాంటాలో ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి, సంక్షేం పథకాలు, టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పరిస్థితులపై పలువురు ఆయనకు సలహాలు, సూచనలు ఇచ్చారు. à°ˆ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన నవీన్ అనే ప్రవాసాంద్రుడు పై ఆసక్తికర సూచన చేశారు.

 
తెలంగాణలో టీడీపీ బలపడాలంటే జూ ఎన్టీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. జూనియర్‌కు బాధ్యతలు అప్పగించి 2019 ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. నవీన్ à°† సలహా ఇవ్వడంతో అక్కడి వారు కేరింతలు కొట్టారు. చప్పట్లతో మద్దతు పలికారు.